Mushrooms : గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ సీజన్లో ఎక్కడ చూసినా పొలాలు, చేల గట్ల మీద పుట్టగొడుగులు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. పల్లెటూళ్లలో చాలా మంది పుట్టగొడుగులను తెంపుకుని వచ్చి తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మనకు సూపర్ మార్కెట్లలోనూ పుట్ట గొడుగులు లభిస్తాయి. ఆధునిక యుగం వచ్చిన తరువాత మనకు పుట్టగొడుగులు కూడా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. అయితే పుట్ట గొడుగులను ఈ సీజన్లో తినడం మాత్రం మరిచిపోవద్దు. వీటితో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుట్ట గొడుగులను వర్షాకాలంలో తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల ఈ సీజన్లో వీటిని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. పుట్టగొడుగుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పుట్టగొడుగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కుగా తింటారు. ఫలితంగా శరీరంలో క్యాలరీలు తక్కువగా చేరుతాయి. దీంతో శరీరం శక్తి కోసం కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు వరమనే చెప్పవచ్చు. వీటిని తింటే విటమిన్ డి కూడా సమృద్ధిగానే లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
పుట్టగొడుగులను తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వయస్సు మీద పడిన తరువాత మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వీటిని తింటే ఎన్నో రకాల బి విటమిన్లు, కాపర్, సెలీనియం, థయామిన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా మనల్ని రక్షిస్తాయి. కనుక ఈ సీజన్లో పుట్టగొడుగులను తినడం మరిచిపోకండి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…