Over Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర పోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా సరే నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం నిర్దేశించిన గంటల సమయం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు నిత్యం 9 గంటలకు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
చైనాలోని వుహాన్లో ఉన్న హువాజ్హాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు 6 ఏళ్ల పాటు 31,750 మందిని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికున్న ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానం, నిద్రించే సమయం, వారికున్న వ్యాధులు తదితర అనేక అంశాలను సేకరించి చివరకు ఆ సమాచారం మొత్తాన్ని విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే నిత్యం 9 గంటల కన్నా ఎక్కువగా నిద్రించే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 23 శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
అలాగే నిత్యం పగటి పూట 90 నిమిషాల కన్నా ఎక్కువ సేపు నిద్రించే వారికి ఆ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 25 శాతం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. కనుక నిత్యం తగినన్ని గంటలపాటు మాత్రమే నిద్రించాలని వారు సూచిస్తున్నారు. ఇక ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అనే జర్నల్లోనూ ప్రచురించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…