Chaddannam : ఇప్పుడంటే మనం మన పెద్దల అలవాట్లను పునికి పుచ్చుకోలేదు కానీ.. నిజంగా వారి అలవాట్లను మనం కూడా పాటిస్తే మన ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అవును మరి. ఎందుకంటే.. మన పెద్దలు ఒకప్పుడు అలాంటి తిండి తినేవారు మరి.. వారి జీవన విధానం వల్ల వారు ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే మన పెద్దల ఆహారపు అలవాట్లలో ముఖ్యమైంది.. ఉదయాన్నే చద్దన్నం తినడం. అందులో కొద్దిగా పెరుగు వేసుకుని మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుని మన పెద్దలు తినేవారు. అయితే ఇలా ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే పెరుగులో ఉండే కాల్షియం మన శరీరానికి సరిగ్గా అందుతుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండాకాలం ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా శక్తి నశించకుండా ఉంటుంది. ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు.
హైబీపీ, నీరసం, మలబద్దకం సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటుంటే ఫలితం ఉంటుంది. అల్సర్లు ఉన్నవారు, జీర్ణాశయం, పేగుల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే ఆయా అవయవాలకు బలం కలుగుతుంది. వాటిల్లో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి.
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…