Paralysis Symptoms : పక్షవాతం అనేది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలోనే పక్షవాతం వచ్చే ముందు మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గుర్తిస్తే.. ముందుగానే ఆ ప్రమాదం నుంచి బయట పడవచ్చు. మరి పక్షవాతం వచ్చే ముందు మనలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
పక్షవాతం వచ్చే ముందు ముఖానికి ఒక వైపు స్పర్శ సరిగ్గా ఉండదు. ఒక వైపును సరిగ్గా కదిలించలేరు. అలాగే ఒక వైపు ఉండే ముఖంపై చర్మం అంతా సాగినట్లు అవుతుంది. ముఖాన్ని రెండు వైపులా సరిగ్గా కదిలిస్తే.. పక్షవాతం వచ్చేది.. రానిదీ తెలుసుకోవచ్చు.. ఒక వైపు ముఖాన్ని కదిలించకపోతే.. వెంటనే అప్రమత్తం అవ్వాలి. తక్షణమే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కొందరికి అప్పుడప్పుడు శరీరంలో కేవలం ఒకే వైపు స్పర్శ లేకుండా అవుతుంది. ఆ సమయంలో కొందరు శరీరంలో ఒక పక్క భాగాన్ని (చేతులు, కాళ్లు కూడా) కదిలించలేకపోతారు. ఇలా గనక ఎవరికైనా అనిపిస్తుంటే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి.
పక్షవాతం వచ్చే ముందు కొందరికి మాట కూడా సరిగ్గా రాదు. అస్పష్టంగా మాట్లాడుతుంటారు. ఇలా గనక జరుగుతుంటే.. వెంటనే స్పందించి.. డాక్టర్ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. పక్షవాతం వచ్చే ముందు కొందరు చేతులను, కాళ్లను పైకి ఎత్తలేకపోతుంటారు. ఇలా జరిగితే పక్షవాతంగా అనుమానించి వెంటనే చికిత్స తీసుకోవాలి. పక్షవాతం వచ్చే ముందు కొందరు.. ఇతరులతో సంభాషించేటప్పుడు అయోమయానికి లోనవుతుంటారు. ఎదుటి వారు చెప్పే మాటలను వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఎప్పుడూ బాగా తలనొప్పిగా ఉండడం, కళ్లు తిరగడం, నడక తడబడడం, దృష్టి లోపాలు.. తదితర లక్షణాలు ఉంటే.. పక్షవాతంగా అనుమానించి డాక్టర్ను కలవాలి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…