Left Over Rice Puri : మనం సాధారణంగా గోధుమపిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీలను తయారు చేస్తూ ఉంటాము. వీటిని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా అన్నం రోటీలను తిన్నారా..? అన్నం రోటీలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా… అవును మీరు విన్నది.. నిజమే. అన్నం, బియ్యంపిండితో చేసే ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే పూరీల వలె చక్కగా పొంగుతాయి. అంతేకాకుండా ఒక్క చుక్క నూనె వాడకుండా ఈ రోటీలను తయారు చేసుకోవచ్చు. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఈ రోటీలను అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. సాధారణ రోటీల వలె వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మెత్తగా, రుచిగా ఉండే ఈ అన్నం రోటీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, బియ్యంపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
అన్నం రోటి తయారీ విధానం..
ముందుగా జార్ లో అన్నం, పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. పిండి చపాతీ పిండిలా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ మెత్తగా ఉండే కొద్దిగా బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పూరీ మాదిరి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి బియ్యంపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఒకవేళ అంచులు గుండ్రంగా రాకపోతే వాటిని గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక రోటిని వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే అన్నం రోటీలు తయారవుతాయి. వీటిని వెజ్, నాన్ వెజ్ ఏ కూరలతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన రోటీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…