Banana Face Pack : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండు జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది. శక్తిస్థాయిలను పెంచుతుంది. అరటి పండు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అయితే అరటి పండు మీ చర్మ కాంతిని కూడా పెంచుతుందని మీకు తెలుసా ? అరటి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6. ఇలా ఎన్నో సూక్ష్మ పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అరటి పండ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పలు ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్లను తయారు చేసి ఉపయోగించడం వల్ల మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి.
ప్రతి ఒక్కరు క్లీన్గా మచ్చలు లేని ముఖం ఉండాలని కోరుకుంటారు. ఇందుకు గాను మార్కెట్లో లభించే అనేక రకాల ఖరీదైన సౌందర్య సాధన ఉత్పత్తులను కొని వాడుతుంటారు. అయితే ఇవి అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చినా వీటిని దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే ఇవి కెమికల్స్ కాబట్టి మన చర్మానికి, మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ అందాన్ని పెంచుకునేందుకు సహజసిద్ధమైన ఉత్పత్తులనే ఉపయోగించాలి. అలాంటి పదార్థాల్లో అరటి పండు కూడా ఒకటి. దీంతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని అందులో డార్క్ చాకొలెట్ వేసి కలపాలి. అందులోనే రోజ్ వాటర్ను కూడా పోసి మెత్తగా పట్టుకోవాలి. దీంతో మెత్తని పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాలపాటు ఉన్నాక కడిగేయాలి. అలాగే అరటి పండు, తేనె మిశ్రమం కూడా పనిచేస్తుంది. అరటి పండులో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి. అలాగే తేనె చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. అందువల్ల ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా వారంలో కనీసం 3 సార్లు చేస్తే మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి.
మీకు కాంతివంతమైన, మచ్చలు లేని ముఖం కావాలంటే అరటి పండు, పచ్చి పాలు ఉపయోగపడతాయి. ఈ రెండింటి మిశ్రమంలో కాస్త తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. అలాగే అరటి పండు, నిమ్మకాయ మిశ్రమాన్ని కూడా ప్రయత్నించవచ్చు. బాగా పండిన అరటిపండులో అర టీస్పూన్ నిమ్మరసం, కాస్త తేనె కలిపి పేస్ట్లా చేసి దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్లా రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మీ ముఖం కళగా మారుతుంది. మొటిమలు, మచ్చలు ఉండవు. ఇలా ఈ అరటి పండు ఫేస్ ప్యాక్లతో మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…