Garikapati Narasimha Rao : మనలో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో పానీపూరీ కూడా ఒకటి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మనక లభిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్కడపడితే అక్కడ ఇది మనకు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. ప్రజలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది వ్యాపారులు దీనిని శుభ్రత లేకుండా తయారు చేస్తారు. పానీపూరీలో నీటిని ఏ నీటితో తయారు చేస్తారో తెలియదు. అందులో వాడే కూరను కూడా అపరిశుభ్ర వాతావరణంలోనే తయారు చేస్తారు. అలాగే ఈ నీటిని చేత్తో కలుపుతూ ఉంటారు. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండానే ప్రజలకు వాటిని అందిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఈ పానీపూరీ బండ్లను ఎక్కువగా రోడ్ల పక్కన మురికి కాలువల పక్కన ఉంచుతారు. పానీపూరీ బండి దగ్గరికి వెళ్లగానే ముందుగా మనకు మురికి కాలువ వాసన వస్తుందని చెప్పవచ్చు. అలాగే అక్కడ ఉండే ఈగలు పానీపూరీ చేసే వస్తువులపై వాలడం కూడా జరుగుతుంది. అయినప్పటికి ప్రజలు వాటినే తినడానికి ఇష్టపడతారు. ఈ పానీపూరీ చేసే వారు కూడా చెమటలు పట్టి అపరిశుభ్రంగానే ఉంటారు. ఇలాంటి వాతావరణంలో తయారు చేసిన పానీపూరీని తీసుకోవడం వల్ల మనం అనారోగ్యాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఈ పానీపూరీ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావుగారు మాట్లాడుతూ ఎంత అపరిశుభ్రంగా చేసినప్పటికి ప్రజలు ఇటువంటి వాటినే తినడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునేటప్పుడు రుచితో పాటు సుచి కూడా చాలా ముఖ్యమని చెప్పారు. మనం తీసుకునే ఆహారానికి రుచి, సుచి అనే రెండు ప్రధాన లక్షణాలు ఉండాలని వారు తెలియజేసారు.
రుచి లేకపోయినప్పటికి మనం తీసుకునే ఆహారం తప్పకుండా సుచిగా ఉండాలని మన మొదటి ప్రాధాన్యం సుచికే ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాడైపోయిన కేకులను కూడా పైన మంచిగా డెకరేట్ చేసి అమ్మేస్తున్నారని ప్రజలు వాటినే కొనుగోలు చేసి తింటున్నారని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోకుండానే వారికి ఇష్టమైన నటులు, క్రికెటర్లు చెప్పిన వాటిని కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసారు. కనుక ప్రజలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరమని తనదైన శైలిలో వ్యక్తపరిచారు.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…