lifestyle

Garikapati Narasimha Rao : పానీపూరీల‌ను తినే వారంద‌రూ త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Garikapati Narasimha Rao : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మ‌న‌క ల‌భిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్క‌డ‌పడితే అక్క‌డ ఇది మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న ల‌భిస్తూ ఉంటుంది. ప్ర‌జ‌లు ఇక్క‌డ అక్క‌డ అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది వ్యాపారులు దీనిని శుభ్ర‌త లేకుండా త‌యారు చేస్తారు. పానీపూరీలో నీటిని ఏ నీటితో త‌యారు చేస్తారో తెలియ‌దు. అందులో వాడే కూర‌ను కూడా అపరిశుభ్ర వాతావ‌ర‌ణంలోనే త‌యారు చేస్తారు. అలాగే ఈ నీటిని చేత్తో క‌లుపుతూ ఉంటారు. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండానే ప్ర‌జ‌ల‌కు వాటిని అందిస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈ పానీపూరీ బండ్ల‌ను ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న మురికి కాలువ‌ల ప‌క్క‌న ఉంచుతారు. పానీపూరీ బండి ద‌గ్గ‌రికి వెళ్ల‌గానే ముందుగా మ‌న‌కు మురికి కాలువ వాస‌న వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే అక్క‌డ ఉండే ఈగ‌లు పానీపూరీ చేసే వ‌స్తువుల‌పై వాల‌డం కూడా జ‌రుగుతుంది. అయిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు వాటినే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఈ పానీపూరీ చేసే వారు కూడా చెమ‌ట‌లు ప‌ట్టి అప‌రిశుభ్రంగానే ఉంటారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో త‌యారు చేసిన పానీపూరీని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యాల‌ను కొని తెచ్చుకోవ‌డ‌మే అవుతుంది. ఈ పానీపూరీ గురించి ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, ప్ర‌వ‌చ‌న క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావుగారు మాట్లాడుతూ ఎంత అప‌రిశుభ్రంగా చేసిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు ఇటువంటి వాటినే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునేట‌ప్పుడు రుచితో పాటు సుచి కూడా చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. మ‌నం తీసుకునే ఆహారానికి రుచి, సుచి అనే రెండు ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు ఉండాల‌ని వారు తెలియ‌జేసారు.

Garikapati Narasimha Rao

రుచి లేక‌పోయిన‌ప్ప‌టికి మ‌నం తీసుకునే ఆహారం త‌ప్ప‌కుండా సుచిగా ఉండాల‌ని మ‌న మొద‌టి ప్రాధాన్యం సుచికే ఇవ్వాల‌ని చెప్పారు. అంతేకాకుండా ఈ మ‌ధ్య కాలంలో పాడైపోయిన కేకుల‌ను కూడా పైన మంచిగా డెక‌రేట్ చేసి అమ్మేస్తున్నార‌ని ప్ర‌జ‌లు వాటినే కొనుగోలు చేసి తింటున్నారని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్ర‌జ‌లు ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో తెలుసుకోకుండానే వారికి ఇష్ట‌మైన న‌టులు, క్రికెట‌ర్లు చెప్పిన వాటిని కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్నార‌ని త‌న ఆవేదన‌ను వ్య‌క్తం చేసారు. క‌నుక ప్ర‌జ‌లు ఆహారాన్ని తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించ‌డం అవ‌స‌ర‌మని త‌నదైన శైలిలో వ్య‌క్తప‌రిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM