Garikapati Narasimha Rao : మనలో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో పానీపూరీ కూడా ఒకటి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మనక లభిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్కడపడితే అక్కడ ఇది మనకు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. ప్రజలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది వ్యాపారులు దీనిని శుభ్రత లేకుండా తయారు చేస్తారు. పానీపూరీలో నీటిని ఏ నీటితో తయారు చేస్తారో తెలియదు. అందులో వాడే కూరను కూడా అపరిశుభ్ర వాతావరణంలోనే తయారు చేస్తారు. అలాగే ఈ నీటిని చేత్తో కలుపుతూ ఉంటారు. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండానే ప్రజలకు వాటిని అందిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఈ పానీపూరీ బండ్లను ఎక్కువగా రోడ్ల పక్కన మురికి కాలువల పక్కన ఉంచుతారు. పానీపూరీ బండి దగ్గరికి వెళ్లగానే ముందుగా మనకు మురికి కాలువ వాసన వస్తుందని చెప్పవచ్చు. అలాగే అక్కడ ఉండే ఈగలు పానీపూరీ చేసే వస్తువులపై వాలడం కూడా జరుగుతుంది. అయినప్పటికి ప్రజలు వాటినే తినడానికి ఇష్టపడతారు. ఈ పానీపూరీ చేసే వారు కూడా చెమటలు పట్టి అపరిశుభ్రంగానే ఉంటారు. ఇలాంటి వాతావరణంలో తయారు చేసిన పానీపూరీని తీసుకోవడం వల్ల మనం అనారోగ్యాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఈ పానీపూరీ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావుగారు మాట్లాడుతూ ఎంత అపరిశుభ్రంగా చేసినప్పటికి ప్రజలు ఇటువంటి వాటినే తినడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునేటప్పుడు రుచితో పాటు సుచి కూడా చాలా ముఖ్యమని చెప్పారు. మనం తీసుకునే ఆహారానికి రుచి, సుచి అనే రెండు ప్రధాన లక్షణాలు ఉండాలని వారు తెలియజేసారు.
రుచి లేకపోయినప్పటికి మనం తీసుకునే ఆహారం తప్పకుండా సుచిగా ఉండాలని మన మొదటి ప్రాధాన్యం సుచికే ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాడైపోయిన కేకులను కూడా పైన మంచిగా డెకరేట్ చేసి అమ్మేస్తున్నారని ప్రజలు వాటినే కొనుగోలు చేసి తింటున్నారని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోకుండానే వారికి ఇష్టమైన నటులు, క్రికెటర్లు చెప్పిన వాటిని కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసారు. కనుక ప్రజలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరమని తనదైన శైలిలో వ్యక్తపరిచారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…