Eating On Cot : మంచం మీద కూర్చుని తింటున్నారా.. ఇది తెలిస్తే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు..!

December 28, 2023 10:24 PM

Eating On Cot : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. కొన్ని తప్పులు చేయడం వలన, మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం, ఈ తప్పులను చేయకుండా చూసుకోవాలి. కొంతమంది, మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. పెద్దలు అలా వద్దని చెప్పినా కూడా, ఆ మాటని కొట్టి పారేస్తూ ఉంటారు. మంచం మీద కూర్చుని తినడం వలన, కొన్ని సమస్యలు అయితే వస్తాయట. మంచం మీద కూర్చుని తింటే, వాస్తు ప్రకారం ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.

ప్రతి ఒక వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు మంచివా..? కావా..? అన్నది ఆలోచించుకోరు. ఇటువంటి తప్పులు చేయడం వలన, సమస్యలు వస్తాయి. ఈశాన్యంలో బరువుని పెట్టడం, లక్ష్మీదేవిలా భావించే గడప మీద కూర్చోవడం వంటివి చాలా తప్పు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన, ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం ఈ అలవాట్లు కూడా ఉండకూడదు. ఇవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి.

Eating On Cot what happens if you do that
Eating On Cot

చాలామంది, మంచం మీద కూర్చుని ఆహారాన్ని తింటూ ఉంటారు. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవికి మంచం మీద కూర్చుని తినడం వలన, కోపం వస్తుంది. ఆ ఇంటి నుండి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్తూ లక్ష్మీదేవి డబ్బుని, సంతోషాన్ని తీసుకువెళ్లి పోతుంది. అందుకని మంచం మీద కూర్చుని అసలు తినకూడదు. మంచం మీద కూర్చుని తింటే ఆనందం, శాంతి కూడా పోతాయి. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన కుటుంబ సభ్యులపై అప్పులు కూడా పెరిగిపోతాయి.

మంచం మీద కూర్చుని ఆహారం తినే వ్యక్తి, నరకానికి వెళ్తాడని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి, ఇలా ఎప్పుడు చేయకండి. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటారు చాలామంది. అది కూడా, అస్సలు మంచిది కాదు. ఉదయం లేవగానే దేవుడు ని చూడడం మంచిది. రాత్రి పడుకున్నాక, ఉదయం లేవగానే మంచాన్ని సరిగ్గా సర్దుకోవాలి. ఎప్పుడు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మంచం పై చెత్తాచెదారం, దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోవాలి. లేదంటే డబ్బులు లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే, ఈ తప్పు జరగకుండా చూసుకోండి. చాలామంది రాత్రి పూట భోజనాలు అయిపోయిన తర్వాత వంటగదిని మురికి గా ఉంచేస్తారు. తినేసిన వాటిని అన్నిటిని, వంటగదిలోనే ఉంచేస్తారు అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now