నేటి తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అనేక మందికి అకస్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం 40కి పైగా పుషప్స్ చేసే వారికి ఏ గుండె జబ్బు రాదని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనంలో తెలిసింది.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టు బృందం 10 ఏళ్ల పాటు 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న 1104 మంది పురుషులను పరిశీలించింది. వారు నిత్యం తీసుకునే ఆహారం, చేసే ఎక్సర్సైజ్ లు, వారికి వచ్చిన గుండె సమస్యలను రికార్డు చేసింది. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే.. నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేసిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 96 శాతం వరకు తక్కువగా ఉంటుందని, అసలు పుషప్స్ చేయని వారిలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడ్డారని సైంటిస్టులు నిర్దారించారు.
కనుక పై పరిశోధన ప్రకారం.. సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. ఎవరైనా నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేస్తే చాలు.. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని అంటున్నారు. పుషప్స్ చేయడం వల్ల ఛాతి, కండరాలకు బాగా వ్యాయామం అవుతుందని, రక్త సరఫరా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్లే హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. కనుక నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పుషప్స్ చేయండి చాలు, మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…