నేటి తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అనేక మందికి అకస్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం 40కి పైగా పుషప్స్ చేసే వారికి ఏ గుండె జబ్బు రాదని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనంలో తెలిసింది.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టు బృందం 10 ఏళ్ల పాటు 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న 1104 మంది పురుషులను పరిశీలించింది. వారు నిత్యం తీసుకునే ఆహారం, చేసే ఎక్సర్సైజ్ లు, వారికి వచ్చిన గుండె సమస్యలను రికార్డు చేసింది. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే.. నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేసిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 96 శాతం వరకు తక్కువగా ఉంటుందని, అసలు పుషప్స్ చేయని వారిలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడ్డారని సైంటిస్టులు నిర్దారించారు.
కనుక పై పరిశోధన ప్రకారం.. సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. ఎవరైనా నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేస్తే చాలు.. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని అంటున్నారు. పుషప్స్ చేయడం వల్ల ఛాతి, కండరాలకు బాగా వ్యాయామం అవుతుందని, రక్త సరఫరా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్లే హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. కనుక నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పుషప్స్ చేయండి చాలు, మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…