Diabetes And Pomegranate : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మందికి వస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన చాలా మంది పడుతున్నారు. దీంతో జీవితాంతం మందులు మింగాల్సి వస్తోంది. అయితే కొందరిలో మాత్రం మందులు మింగినా షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు. అలాంటి వారు తమ ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ను కంట్రోల్ చేయగలిగే పండ్లను తింటే మంచిది. వాటిల్లో దానిమ్మ పండు కూడా ఒకటి. మరి డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందామా.
డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే వాటిలో ఉండే 4 రకాల యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. సదరు యాంటీ ఆక్సిడెంట్లు ellagitannin అనే వర్గానికి చెందుతాయి. ఇవి షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్న పలువురు పేషెంట్లు దానిమ్మ పండ్లను తిన్నాక 3 గంటల తరువాత వారి షుగర్ లెవల్స్ను పరీక్షించగా.. అవి చాలా వరకు తగ్గాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని తగ్గించడంలో దానిమ్మ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు చెబుతున్న ప్రకారం.. దానిమ్మ పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే పాలీఫినాల్స్, ఆంథోసయనిన్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గిస్తాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
డయాబెటిస్ ఉండేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల వారికి వైద్యులు కొలెస్ట్రాల్ మెడిసిన్ను కూడా ఇస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్ మరింత కంట్రోల్లో ఉండాలంటే.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తరచూ దానిమ్మ పండ్లను తినాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి శరీర కణజాలాన్ని నాశనం చేసి క్యాన్సర్కు కారణమవుతాయి. కనుక దానిమ్మ పండ్లను తింటే.. వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సదరు ఫ్రీ ర్యాడికల్స్ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తరచూ తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…