Diabetes And Pomegranate : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మందికి వస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన చాలా మంది పడుతున్నారు. దీంతో జీవితాంతం మందులు మింగాల్సి వస్తోంది. అయితే కొందరిలో మాత్రం మందులు మింగినా షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు. అలాంటి వారు తమ ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ను కంట్రోల్ చేయగలిగే పండ్లను తింటే మంచిది. వాటిల్లో దానిమ్మ పండు కూడా ఒకటి. మరి డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందామా.
డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే వాటిలో ఉండే 4 రకాల యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. సదరు యాంటీ ఆక్సిడెంట్లు ellagitannin అనే వర్గానికి చెందుతాయి. ఇవి షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్న పలువురు పేషెంట్లు దానిమ్మ పండ్లను తిన్నాక 3 గంటల తరువాత వారి షుగర్ లెవల్స్ను పరీక్షించగా.. అవి చాలా వరకు తగ్గాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని తగ్గించడంలో దానిమ్మ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు చెబుతున్న ప్రకారం.. దానిమ్మ పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే పాలీఫినాల్స్, ఆంథోసయనిన్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గిస్తాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
డయాబెటిస్ ఉండేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల వారికి వైద్యులు కొలెస్ట్రాల్ మెడిసిన్ను కూడా ఇస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్ మరింత కంట్రోల్లో ఉండాలంటే.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తరచూ దానిమ్మ పండ్లను తినాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి శరీర కణజాలాన్ని నాశనం చేసి క్యాన్సర్కు కారణమవుతాయి. కనుక దానిమ్మ పండ్లను తింటే.. వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సదరు ఫ్రీ ర్యాడికల్స్ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తరచూ తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…