Cucumber Smoothie : వేసవి కాలంలో ఎవరైనా సరే.. శరీరాన్ని చల్లబరుచుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే శీతల పానీయాల్లో కూల్డ్రింక్లు కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్డ్రింక్స్ అయితే మనకు ఎలాంటి పోషకాలను అందివ్వవు. అలాగే శరీరాన్ని చల్లబరచవు. కానీ సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడిన పానీయాలు అయితే మనకు అటు పోషణ, ఇటు చల్లదనం రెండూ లభిస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో కీరదోస స్మూతీ కూడా ఒకటి. దీన్ని వేసవిలో తాగితే మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి శరీరం ఉన్నవారు ఈ స్మూతీని ఎప్పుడైనా సరే తాగవచ్చు. అలాగే పలు పోషకాలు కూడా అందుతాయి. మరి కీరదోస స్మూతీ ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కీరదోస స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చల్లని పెరుగు – 270 గ్రాములు, కీరదోస పేస్ట్ – 200 గ్రాములు, కట్ చేసిన టమాటాలు – 10 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – తగినంత.
కీరదోస స్మూతీ తయారు చేసే విధానం..
పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా కలిపి మిక్సీ పట్టాలి. జ్యూస్లా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంత నీరు కలపవచ్చు. దీంతో కీరదోస స్మూతీ తయారవుతుంది. ఉప్పు, మిరియాల పొడిలను టేస్ట్కు సరిపడా కలుపుకుంటే చాలు.. చల్ల చల్లని కీరదోస స్మూతీ రెడీ అయినట్టే.
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…