Aratikaya Bajji : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఎవరి అభిరుచికి తగినట్లు వారు సాయంత్రం చిరుతిండిని లాగించేస్తుంటారు. అయితే బయటి తిండి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. కనుక ఇంట్లోనే వీటిని వండుకుని తింటే బాగుంటుంది. ఈ క్రమంలోనే బయట బండ్లపై లభించే అరటికాయ బజ్జీలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. అరటికాయ బజ్జీల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ – 1, శనగపిండి – 1 కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, మిరపకారం – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీస్పూన్, కసూరీ మేథీ – 1 టీస్పూన్, వంట సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వేయించిన పల్లీలు – 1 టేబుల్ స్పూన్, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్.
అరటి కాయల తొక్కు తీసి సన్నగా చక్రాల్లా తరిగి ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక అరటికాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కత్తితో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్ చేయాలి. మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్ చేసి పైన నిమ్మకాయ రసం పిండి సర్వ్ చేయాలి. వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…