Aloe Vera : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔషధ మొక్కల్లో కలబంద కూడా ఒకటి. దీన్ని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కలబందకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్రస్తుతం అనేక రకాల కాస్మొటిక్స్, మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే కలబంద గుజ్జును మనం కూడా పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు వాడవచ్చు. మరి ఆ గుజ్జుతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
కలబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ గుజ్జును తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపునే కలబంద గుజ్జును తింటే జీర్ణాశయంలో ఉండే సూక్ష్మ క్రిములన్నీ నశిస్తాయి. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు త్వరగా మానాలంటే కలబంద గుజ్జును ఉపయోగించాలి. ఆ గాయాలపై కలబంద గుజ్జును రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. కలబంద గుజ్జుకు కొన్ని నీళ్లు కలిపి దాన్ని మౌత్వాష్గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో దంత సమస్యలు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి.
పాదాలు బాగా పగిలిన వారు ఆ పగుళ్లపై కలబంద గుజ్జును అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వరగా పాదాల పగుళ్లు తగ్గుతాయి. మలబద్దకం సమస్య ఉన్నవారు నిత్యం రాత్రి పూట కలబంద గుజ్జును తినాలి. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలు కూడా తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలోనూ అలోవెరా చక్కగా పనిచేస్తుంది. కొద్దిగా గుజ్జును తీసుకుని ఆయా ప్రదేశాలపై రాస్తే ఆ సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం కలబంద గుజ్జును తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…