సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఎదగాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలకు చెందిన వారు 60 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇతర కేటగిరిలకు చెందిన వారు 55 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్ విభాగంలో 405 ఖాళీలు ఉండగా, ఓబీసీ విభాగంలో 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. 90 నిమిషాల సమయం ఉంటుంది. అప్లికేషన్ ను ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫీజు రూ.750గా నిర్ణయించారు. రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.150 చెల్లిస్తే చాలు. అభ్యర్థులకు 12 నెలల పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ట్రెయినింగ్ సమయంలో మొదటి 9 నెలలు నెలకు రూ.2500 స్టయిపండ్ ఇస్తారు. తరువాత 3 నెలలకు నెలకు రూ.10వేలు స్టయిపండ్ ఇస్తారు. వేతనం రూ.48వేల నుంచి రూ.85వేల వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్లను కూడా ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 20ని చివరి తేదీగా నిర్ణయించారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…