Yawning : మానవ శరీరమే ఓ చిత్రమైన నిర్మాణం. ఎన్నో లక్షల కణాలు, కణజాలాలతో నిర్మాణమైంది. ఎన్నో అవయవాలు వాటి విధులు నిత్యం నిర్వర్తిస్తుంటాయి. ఈ క్రమంలో మనం మనకు తెలియకుండానే శరీరం ద్వారా కొన్ని సహజమైన ప్రక్రియలను రోజూ ఆయా సందర్భాల్లో నిర్వహిస్తుంటాం. అలాంటి వాటిలో ఒకటే ఆవులింత. అయితే అసలు ఆవులింతలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా..?
శరీరం బాగా అలసిపోయినప్పుడు, తగినంత నిద్ర పోనప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఈ క్రమంలో ఆ ఆక్సిజన్ను భర్తీ చేసేందుకు గాను ఆవులింతలు వస్తాయి. ఆవులింత వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో గాలి మన శరీరం లోపలికి వెళ్తుంది. దీని వల్ల మనకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. అనంతరం అదే మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మన శరీరం రిలాక్స్ అయి ఉత్తేజంగా ఉంటుంది. అయితే ఆవులింత తీసే సమయంలో మన కళ్ల నుంచి నీరు ఎందుకు వస్తుందో మీకు తెలుసా..?
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆవులింతలు తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తుందనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే అలా నీరు రావడం వెనుక ఉన్న విషయం మాత్రం అది కాదు. ఆవులింత తీసినప్పుడు కళ్లు మూసుకుంటాం కదా. అలా మూసుకున్నప్పుడు కంటి రెప్పలు ముక్కు పై భాగం పక్కన కలుసుకునే punctum అనే పాయింట్ lacrimal గ్రంథులపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ క్రమంలో కంటి పై రెప్పలు దగ్గరకు ముడుచుకుని కంట్లో నుంచి నీటిని బయటకు పంపిస్తాయి. అందుకే మనం ఆవులింత తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తుంది. అయితే ఇలా జరగడం అత్యంత సహజమైన ప్రక్రియే. దీని వల్ల మనకు ఎలాంటి హాని లేదు. కళ్లు పొడిబారకుండా ఉండేందుకే అలా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు మీరు ఆవులింత తీసినప్పుడు కళ్ల నుంచి నీరు వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…