Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో లేకుండా అనేక మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటే అన్ని అవయవాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
ముఖ్యంగా మెదడుకు, గుండెకు రక్తప్రసరణ బాగా జరగాలి. అప్పుడే అవి ఎప్పుడూ చురుగ్గా పనిచేస్తాయి. రక్త నాళాలలో అడ్డంకులు కలిగినా, బ్లడ్ సర్కులేషన్ తగ్గినా వీటి పనితీరుపై ప్రభావం పడుతుంది. మెదడు, గుండె సమస్యలతో బాధపడే వాళ్ళకి రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే డాక్టర్లు మందులు ఇస్తారు. అలా కాకుండా మనం పలు ఆహారాలను కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె సమస్యలు వంటివి రావు.
చాలామంది వెల్లుల్లిని వంటల్లో వాడుతుంటారు. వెల్లుల్లిని తీసుకుంటే చక్కటి లాభాలని మనం పొందొచ్చు. వెల్లుల్లి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. వెల్లుల్లిని తరచూ ఆహారంలో తీసుకుంటే, రక్తం చిక్కబడకుండా ఉంటుంది. తరచూ వంటల్లో వెల్లుల్లి వాడితే గుండె సమస్యల ముప్పు ఉండదు. అదేవిధంగా అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండా ఇది చూస్తుంది. అల్లంను తేనెలో నానబెట్టి తీసుకుంటే చక్కటి లాభాన్ని పొందవచ్చు.
రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా అల్లం చూస్తుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా చూస్తుంది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. రక్తప్రసరణని పసుపు కూడా మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. పసుపుని కూడా వంటల్లో తరచూ వాడండి. పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే కూడా మంచిదే. ఉలవలను కూడా తీసుకోండి. ఇవి కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఉలవలు పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. కొలెస్ట్రాల్ కరగడానికి ఉలవలు బాగా సహాయపడతాయి. ఇలా వీటిని తీసుకుంటే గుండెకు ముప్పు ఉండదు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…