Sabja Seeds : సాధారణంగా వేసవి వచ్చిందంటే చాలు.. శరీరంలో వేడి ఇట్టే పెరిగిపోతుంది. వేసవి తాపానికి తట్టుకోలేకపోతుంటారు. ఇక త్వరలోనే వేసవి కూడా రానుంది. దీంతో శరీరాన్ని చల్ల బరుచుకునేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలను, శరీరానికి చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో సబ్జా గింజలు కూడా ఒకటి. అయితే వేసవి సంగతి పక్కన పెడితే కొందరికి శరీరంలో ఎల్లప్పుడూ వేడి ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే ఈ వేడిని తగ్గించుకునేందుకు సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో విపరీతమైన వేడి కారణంగా చెమట, కళ్ళ మంటలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో వేడి తగ్గించటానికి ఒక అద్భుతమైన డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా అలసట, నీరసం వంటివి అన్నీ తొలగిపోతాయి. సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక బౌల్ లో ఒక టీస్పూన్ సబ్జా గింజలను వేసి నీటిని పోసి మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో అర టీస్పూన్ సొంపు, చిన్న పటికబెల్లం ముక్క, రెండు యాలకులు, చిటికెడు నల్ల ఉప్పు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి నానబెట్టిన సబ్జా గింజలు, మిక్సీ చేసిన పొడి, పది పుదీనా ఆకులను నలిపి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం, నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపి గ్లాసులోకి సర్వ్ చేయటమే. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా తలనొప్పి, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ డ్రింక్ ను రోజు విడిచి రోజు తాగవచ్చు. అలాగే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ డ్రింక్ ను తాగితే చాలా రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. అలసట, నీరసం వంటివి వెంటనే తొలగిపోతాయి. ఇలా సబ్జా గింజలతో చేసిన ఈ డ్రింక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…