Sleep After Lunch : బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఈ మూడింటిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తక్కువగా, లంచ్, డిన్నర్ హెవీగా కానిచ్చేస్తారు. అయితే అలా లంచ్, డిన్నర్ ఎక్కువగా తిన్న వెంటనే అలాంటి వారికి నిద్ర వస్తుంది. రాత్రంటే సహజంగానే నిద్ర వస్తుంది, అది కామనే. కానీ.. మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత కూడా కొందరికి నిద్ర వస్తుంది. అయితే నిజానికి అలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది లంచ్, డిన్నర్ హెవీగా చేస్తారని ముందే చెప్పుకున్నాం కదా. అయితే అలా ఎక్కువగా భోజనం చేసినప్పుడు శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయితేనే కదా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండేది. ఈ క్రమంలో శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. ఫలితంగా సెరటోనిన్, మెలటోనిన్ అనే రెండు హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. నిజానికి మెలటోనిన్ అనేది నిద్ర హార్మోన్. అది నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే మధ్యాహ్నం లంచ్ ఎక్కువగా చేస్తే అనేక మందికి నిద్ర వస్తుంది.
అయితే నిద్ర హార్మోన్ల వల్లే కాదు, మధ్యాహ్నం ఎక్కువగా తినడం వల్ల ఆ తిండిని జీర్ణం చేసేందుకు శరీరం 60 నుంచి 75 శాతం వరకు శక్తిని ఖర్చు పెడుతుందట. దీంతో మనకు పని చేస్తానికి కావల్సినంత శక్తి లభించదు. ఫలితంగా శరీరం రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు నిద్ర తన్నుకు వస్తుంది. అదే లంచ్ తక్కువగా తీసుకుంటే నిద్ర రాదు. దీంతో యాక్టివ్గా ఉండవచ్చు. ఇదే సూత్రం రాత్రి పూట చేసే డిన్నర్కు కూడా వర్తిస్తుంది. అప్పుడు మనకు ఎటూ ఎక్కువ శక్తి అవసరం ఉండదు, కనుక తక్కువ తిన్నా చాలు. దాంతో అదనపు కొవ్వు చేరదు.
అదేవిధంగా నిద్ర హార్మోన్ల ద్వారా కాకుండా సహజంగా వచ్చే నిద్రతోనే నిద్రలోకి జారుకోవచ్చు. అది మరుసటి రోజున మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అయితే మధ్యాహ్నం తక్కువగా తింటే మళ్లీ ఆకలి వేస్తే ఎలా..? అలా ఆకలి వేసినప్పుడు పండ్లు, నట్స్ వంటివి తినాలి. అవి కూడా లైట్గా తీసుకోవాలి. దీంతో నిద్ర రాదు, యాక్టివ్గా ఉంటారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…