Over Sleep : ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రని పొందడం కూడా అవసరం. అయితే రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా నిద్రపోవడం వలన మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువగా నిద్ర పోవడం వలన ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు సరైన జీవనశైలి లేకపోవడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. బాగా ఎక్కువ సేపు నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అతిగా నిద్రపోవడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయని స్టడీ చెప్తోంది. మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ తగ్గినప్పుడు లేదంటే జరగనప్పుడు స్ట్రోక్ వస్తుంది. మెదడు ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందో ఆ శరీర భాగంలో లోపాలు ఏర్పడతాయి.
అధ్యయనం ప్రకారం తేలిన విషయం ఏమిటంటే రాత్రి పూట ఎనిమిది గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వలన స్ట్రోక్ వచ్చే ప్రమాదం 23 శాతం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఉదయం పూట 90 నిమిషాలు నిద్రపోయే వాళ్లకి 30 నిమిషాల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళతో పోల్చి చూసినట్లయితే పక్షవాతం వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంది. ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం 82 శాతం ఎక్కువగా ఉంది.
ఎక్కువసేపు నిద్రపోవడం వలన నిరాశ కలుగుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువసేపు నిద్రపోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. బరువు కూడా బాగా పెరిగిపోతారు. అలాగే స్ట్రోక్ ప్రమాదం కూడా ఇది పెంచుతుంది. ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సరైన జీవన శైలి పాటించాలి. సరిపడా నిద్ర, సరిపడా నీళ్లు, వ్యాయామం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…