Nail Biting : చాలా మందికి నోటితో గోళ్ళని కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలే కాదు. పెద్దలు కూడా కొరుకుతూ ఉంటారు. ఏదో ఆలోచిస్తూ గోళ్లు కొరకడం, బోర్ కొట్టినప్పుడు, భయం వేసినప్పుడు ఇలా కొన్ని సందర్భాలలో గోళ్ళని ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఒక థియరీ ప్రకారం, ఎమోషన్స్ ని బట్టి గోళ్ళని కొరకడం జరుగుతుందని తెలిసింది.
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ గోళ్లు కొరకడం వలన పళ్ళు పాడవుతాయని చెప్తోంది. ఒకవేళ కనుక పళ్ళకి బ్రేసెస్ ఉన్నవాళ్లు, గోళ్ళని కొరికితే, పంటిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. గోళ్ళని కొరకడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. తలనొప్పి, ఫేషియల్ పెయిన్, పళ్ళ సెన్సిటివిటీ, పళ్ళు ఊడిపోవడం వస్తాయి.
ఇలా పంటి డామేజ్ మాత్రమే కాకుండా గోళ్ళని కొరకడం వలన బ్యాక్టీరియా పెరిగి మరిన్ని ప్రమాదాలని కలిగిస్తుంది. బ్యాక్టీరియా వలన గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పళ్ళని కొరకడం వలన గోళ్లు ఎర్రగా అయిపోవడం, వాపు కలగడం, చీము పట్టడం లాంటివి కూడా కలుగుతాయి.
ఎక్కువగా చిన్నారులు, టీనేజర్స్, గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటుకి దూరంగా ఉండాలంటే, గోళ్ళని ఎప్పటికప్పుడు నెయిల్ కట్టర్ తో, చిన్నగా కట్ చేసుకుంటూ ఉండండి. గోళ్ళని కొరికే అలవాటుకి బదులుగా మీరు ఓ స్ట్రెస్ బాల్ ని వాడడం వంటివి చేయండి. అలానే ఈ అలవాటు నుండి బయట పడాలంటే చేదుగా ఉండే నెయిల్ పాలిష్ ని గోళ్ళకి పెట్టుకుంటే గోళ్ళని నోట్లో పెట్టుకోవడానికి చికాకుగా ఉంటుంది. ఇలా వీటి ద్వారా గోళ్ళని కొరికే అలవాటు నుండి బయట పడొచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…