Breastfeeding : ఒక స్త్రీ జీవితంలో గర్భం ధరించడం దగ్గరనుండి బిడ్డని కనేంత వరకు ఒక ఎత్తు. బిడ్డ పుట్టాక బిడ్డతో పాటుగా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చంటి బిడ్డను చూసుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కానీ అది అసాధ్యం. ఏ రాత్రో చంటి బిడ్డ పాలకు లేచి ఏడుస్తాడో తెలియని పరిస్ధితి. కంటికి రెప్పలా బిడ్డని కాచుకుని చూసుకునే క్రమంలో కంటినిండా నిద్ర కరువవుతుంది. అలాంటప్పుడు తన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలిచ్చే తల్లి కడుపునిండా ఆహారం తీసుకోవాలి. వీటితో పాటుగా పెద్డలు చెప్పే జాగ్రత్తలు పాటించాలి.
పాలిచ్చే తల్లులకు అప్పుడప్పుడు పాలు గడ్డ కట్టి చలి జ్వరం వస్తుంది. తీవ్రమైన చలి మాత్రమే కాదు రొమ్ము నొప్పి కూడా ఉంటుంది. ఈ వేదన అంతా ఇంతా కాదు. ఒకవైపు నొప్పి భరించలేక మరోవైపు బిడ్డకు పాలు ఇవ్వలేక నరకయాతన కనబడుతుంది .దీనినే మన నాన్నమ్మలు, అమ్మమ్మలు రొమ్ముసుడి అంటారు. బిడ్డల తల సుడి రొమ్ముకి తగిలినట్టయితే పాలు గడ్డ కట్టి చలిజ్వరం వస్తుంది అంటారు. పిల్లల సుడికి దీనికి ఏంటి సంబంధం అని ఈ కాలపు పిల్లలు దీన్ని లైట్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతే కాదు పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకు ఎప్పుడూ ఒక రొమ్మే ఇవ్వకూడదు. దీనివల్ల రెండో రొమ్ములు పాలు రావడం మానేయడమే కాదు, వక్షోజాల పరిమాణంలో కూడా తేడా వస్తుంది. ఒక రొమ్ము కొద్ది సేపు మరొక రొమ్ము కొద్దిసేపు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. దీనివల్ల పిల్లలకు కావలసిన పోషకాలు అందవు. ఎందుకంటే పిల్లలకు ఒక రొమ్ము పాలు కొంచెం ఇచ్చి ఆపేస్తే అందులో ముందుగా వాటర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత కొవ్వు సంబంధిత పోషకాలు ఉంటాయి. కాబట్టి ఒక రొమ్ము కంప్లీట్ గా ఇచ్చాక, ఇంకొక రొమ్ము ఇవ్వాలి.
దాంతో పాటు వారు తమ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. పెద్దల మాట పెడచెవిన పెట్టరాదు. ఎందుకంటే రొమ్ముసుడి చాలా భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. సుడి తాకడం వల్ల కాదు పాలు ఇవ్వక గడ్డ కట్టడం వల్ల అని అనుకునే వాళ్లు పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు ఇస్తూ వారు దాని బారిన పడకుండా చూసుకోవాలి.
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…