Honey Soaked Dates : తేనె.. మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వల్ల తేనె మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండు ఖర్జూరం పండ్లను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. వాటితో కూడా మనకు అనేక లాభాలే కలుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండ ఖర్జూరం పండ్లను మీరెప్పుడైనా తిన్నారా..? అలా తిన్నా.. మనకు అనేక రకాల ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక జార్లో 3/4 వంతు తేనె తీసుకోవాలి. అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. అనంతరం మూత బిగించి జార్ను బాగా షేక్ చేయాలి. అనంతరం ఆ జార్ను వారం పాటు అలాగే ఉంచాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్ను షేక్ చేయవచ్చు. వారం తరువాత జార్ను తీసి రోజుకు ఒకటి రెండు చొప్పున ఆ ఖర్జూర పండ్లను తినాలి. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. పైన చెప్పినట్టుగా తయారు చేసిన తేనె, ఎండు ఖర్జూరం మిశ్రమం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీర రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమం తింటే ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. యాంటీ బయోటిక్ గుణాల వల్ల గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు రోజూ ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు. పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటే మతిమరుపు తగ్గుతుంది. మహిళలకు కావల్సిన ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి. సీజనల్ గా వచ్చే వివిధ రకాల అలర్జీలు పోతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పలు రకాల క్యాన్సర్లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది. క్యాన్సర్ కణతులు వృద్ధి చెందవు.
జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బాక్టీరియా నాశనమవుతుంది. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం బాగా పెరుగుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. బీపీ తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరిగిపోతుంది. ఇలా తేనె, ఖర్జూరాల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…