Kidneys : ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు చాలా మందిని బాధపెడుతున్నాయి. కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే కచ్చితంగా ఆరోగ్య నిపుణులని కన్సల్ట్ చేయాలి. ఈరోజూల్లో తీసుకునే ఆహారం, జీవన విధానం మారిపోవడం వలన చిన్న వయసు వారిలోనే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. కిడ్నీల పనితీరులో ఏదైనా సమస్య వస్తే, అది మొత్తం శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ పాడవ్వడం ప్రాణానికే ప్రమాదం. అందుకే కిడ్నీ వ్యాధి లక్షణాలని ఎప్పటికప్పుడు గుర్తించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు..?, కిడ్నీలని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చు వంటి విషయాలని కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఉదయం పూట వికారంగా ఉండటం, వాంతులు రావడం వంటివి జరిగితే అవి కిడ్నీ సమస్య అని గుర్తించాలి. నురగతో కూడిన మూత్రం రావడం, మూత్రంలో రక్తం రావడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు లక్షణాలు.
వెన్నునొప్పి, పొత్తి కడుపునొప్పి తీవ్రంగా వస్తే కూడా అది కిడ్నీ సమస్య అని గుర్తు పెట్టుకోవాలి. కళ్ళు చుట్టూ వాపులు రావడం కూడా కిడ్నీ సమస్యకి లక్షణమే. ఒకసారి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే ఆరోగ్యం మొత్తం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి బాగుండాలి. అలానే మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి.
పసుపు, గుమ్మడి గింజలు, బెర్రీస్, అల్లం, పెరుగు, కొత్తిమీర తీసుకుంటూ ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గ్లాసులు మంచినీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అలానే ఆపిల్స్, ఓట్స్, ఉల్లిపాయలు కూడా తీసుకుంటూ ఉండండి. కిడ్నీలకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…