Calcium : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారం కావాలి. పోషకాలు ఒక్కొక్కటీ ఒక్కో రకమైన ప్రయోజనాలను మనకు అందిస్తాయి. ఈ క్రమంలోనే వాటిల్లో కాల్షియం చెప్పుకోదగిన పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాదు, కిడ్నీ స్టోన్లు రాకుండా చూస్తుంది. కనుక కాల్షియాన్ని కూడా మనం తీసుకోవాల్సిందే. అయితే కాల్షియం కోసం చాలా మంది పాలు మాత్రమే తాగాలని అనుకుంటారు. కానీ పాలను తాగలేని వారు మరి కాల్షియం ఎలా పొందుతారు, అందుకోసం ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. పాలను తాగలేని వారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే చాలు, దాంతో కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఇక కాల్షియం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో కన్నా కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో బాదంపప్పు ఒకటి. గుప్పెడు బాదంపప్పును తింటే సుమారుగా 76 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. అలాగే అంజీర్ పండ్లలోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. 100 గ్రాముల అంజీర్ పండ్లను తింటే సుమారుగా 55 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. ఇక 100 గ్రాముల ఖర్జూరాలను తింటే 64 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
100 గ్రాముల చియా విత్తనాలను తింటే 631 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. దీంతోపాటు కాల్షియాన్ని అందించడంలో నువ్వులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. 100 గ్రాముల నువ్వులను తినడం ద్వారా 989 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. పాల కన్నా వీటిల్లో కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కాల్షియాన్ని పొందవచ్చు. అలాగే గుప్పెడు జీడిపప్పును తినడం వల్ల సుమారుగా 57 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. ఇక వాల్నట్స్ను 100 గ్రాముల మేర తింటే 98 మిల్లీగ్రాముల వరకు కాల్షియాన్ని పొందవచ్చు. ఇలా పాలను తాగలేని వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియాన్ని పుష్కలంగా పొందవచ్చు. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…