Calcium : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారం కావాలి. పోషకాలు ఒక్కొక్కటీ ఒక్కో రకమైన ప్రయోజనాలను మనకు అందిస్తాయి. ఈ క్రమంలోనే వాటిల్లో కాల్షియం చెప్పుకోదగిన పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాదు, కిడ్నీ స్టోన్లు రాకుండా చూస్తుంది. కనుక కాల్షియాన్ని కూడా మనం తీసుకోవాల్సిందే. అయితే కాల్షియం కోసం చాలా మంది పాలు మాత్రమే తాగాలని అనుకుంటారు. కానీ పాలను తాగలేని వారు మరి కాల్షియం ఎలా పొందుతారు, అందుకోసం ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. పాలను తాగలేని వారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే చాలు, దాంతో కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఇక కాల్షియం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో కన్నా కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో బాదంపప్పు ఒకటి. గుప్పెడు బాదంపప్పును తింటే సుమారుగా 76 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. అలాగే అంజీర్ పండ్లలోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. 100 గ్రాముల అంజీర్ పండ్లను తింటే సుమారుగా 55 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. ఇక 100 గ్రాముల ఖర్జూరాలను తింటే 64 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.
100 గ్రాముల చియా విత్తనాలను తింటే 631 మిల్లీగ్రాముల వరకు కాల్షియం పొందవచ్చు. దీంతోపాటు కాల్షియాన్ని అందించడంలో నువ్వులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. 100 గ్రాముల నువ్వులను తినడం ద్వారా 989 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. పాల కన్నా వీటిల్లో కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కాల్షియాన్ని పొందవచ్చు. అలాగే గుప్పెడు జీడిపప్పును తినడం వల్ల సుమారుగా 57 మిల్లీగ్రాముల మేర కాల్షియం లభిస్తుంది. ఇక వాల్నట్స్ను 100 గ్రాముల మేర తింటే 98 మిల్లీగ్రాముల వరకు కాల్షియాన్ని పొందవచ్చు. ఇలా పాలను తాగలేని వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియాన్ని పుష్కలంగా పొందవచ్చు. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…