Hair Growth : వయసుతో సంబంధం లేకుండా నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు తెగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి వివిధ కారణాలు ఉన్నాయి. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, జుట్టుకు పోషకాలు సరిగ్గా అందకపోవడం, రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడం వంటి వివిధ కారణాల చేత జుట్టు సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలను మాత్రమే ఈ చిట్కా తయారీకి ఉపయోగించాల్సి ఉంటుంది. జుట్టు సమస్యలను దూరం చేసే ఈ చిట్కా ఏమిటి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం మెంతులను, పెరుగును, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. ముఖ్యంగా తల చర్మానికి అంటేలా బాగా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. చుండ్రు సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. తల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చక్కటి అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…