Heart Attack : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలకి గురవుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. గుండెపోటు తర్వాత మొదటి గంట ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాల నుండి బయటపడవచ్చు. లేదంటే ప్రాణాలే పోతాయి. గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుండెపోటుకి సంబంధించిన ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
గుండెపోటు కలిగినట్లయితే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెపోటు వచ్చినప్పుడు రోగి రెండు లేదా నాలుగు గంటలలోపు చికిత్స పొందితే గుండె కండరాలకి నష్టం లేకుండా ఉండవచ్చు. ఐదు నుండి ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే గుండె కండరాల యొక్క ముఖ్యమైన ప్రాంతం దెబ్బతింటుంది. 12 గంటల తర్వాత వైద్యం చేసినట్లయితే అది చాలా ప్రమాదకరం.
సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ప్రకారం దాదాపు 47 శాతం మంది ఆసుపత్రికి చేరుకునేలోగానే ఆకస్మికంగా గుండె ఆగిపోవడం జరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. గుండెపోటు వచ్చిన ఆరు గంటల్లోగా వైద్యం తీసుకోకపోతే వ్యక్తి ప్రాణానికి చాలా ప్రమాదం. గుండె పోటు వచ్చిన 90 నిమిషాలలో గుండె కండరం పాడైపోతుంది. కనుక వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. దెబ్బతిన్న గుండె కండరాలు మాత్రమే కాకుండా అసాధారణ హృదయ స్పందన వలన కూడా ప్రమాదమే ఉంటుంది.
గుండెపోటు వచ్చిందంటే ఛాతి నొప్పి మొదట వస్తుంది. ఛాతిలో భారంగా, మంటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. విశ్రాంతి లేకపోవడం, బాగా చెమట పట్టడం, దవడ నొప్పి, ఎడమ చేయి నొప్పి, వీపులో నొప్పిగా ఉండడం వంటివి గుండెపోటు రావడానికి ముందు కలుగుతాయి. గుండెపోటు వచ్చిన వెంటనే ఆంబులెన్స్ కి కాల్ చేసి వెంటనే ఆసుపత్రికి చేరడం ముఖ్యం. సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకుంటే, గుండెపోటు వచ్చిన తర్వాత కూడా సరైన వైద్యం తీసుకుని, మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…