Fennel Seeds : చాలా మంది సోంపుని తీసుకుంటూ ఉంటారు. భోజనం తిన్నాక సోంపు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. సోంపు గింజల వలన లాభాలని పొందవచ్చు. చూశారంటే మీరు కూడా ఈసారి తప్పకుండా తింటారు. సోంపు గింజలు చిన్నగా వున్నా వాటి వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. క్యాల్షియం, మెగ్నీషియంతోపాటు పొటాషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు సోంపులో ఉంటాయి.
సోంపు గింజలను తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. అందుకే చాలామంది భోజనం తిన్న తర్వాత సోంపుని తీసుకుంటూ ఉంటారు. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు. జీవక్రియని వేగవంతం చేయడానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది. క్యాలరీలని వేగంగా ఖర్చు చేసి బరువు తగ్గే అవకాశం కూడా సోంపు ఇస్తుంది. సోంపు తీసుకోవడం వలన నిద్రలేమి సమస్య కూడా ఉండదు.
సోంపుతో మంచి నిద్రని పొందొచ్చు. కాబట్టి ఒత్తిడి కారణంగా లేదంటే ఇతర కారణాల వలన సరైన నిద్రని పొందలేక పోయేవాళ్లు సోంపును తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు. ఇందులో పొటాషియం ఉండడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. హృదయ స్పందన రేటు అదుపులో ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ సోంపు గింజల్ని రాత్రిపూట నానబెట్టుకుని, ఉదయాన్నే నానబెట్టిన సోంపు గింజలను తినేసి, ఆ నీటిని తాగేస్తే ఈ లాభాలు అన్నింటినీ మీరు పొందొచ్చు, మరి ఇక ఈసారి తప్పకుండా సోంపుని రోజూ తీసుకోండి. అప్పుడు ఉదర సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, నిద్రలేమి, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వంటివి తొలగిపోతాయి. అలాగే పోషకాలు కూడా అందుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…