Drinking Water : అధిక బరువు.. నేటి తరుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. కారణాలు ఏమున్నా ప్రస్తుతం చాలా మంది స్థూలకాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బరువును తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు మందులు మింగడం, ఎక్సర్సైజులు చేయడం చేస్తుంటే ఇంకొందరు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? నీటి వల్లే మనం అధిక శాతం బరువు తగ్గవచ్చని. అవును, మీరు విన్నది నిజమే. కింద సూచించిన విధంగా నీటిని తాగితే కేవలం 10 రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇది కడుపులో ఏర్పడే అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడమే కాదు, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు గానీ, బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత గానీ ఒక గ్లాస్ నీరు తాగాలి. అయితే కనీసం 30 నిమిషాల ముందు లేదా తరువాత ఇలా చేయాలి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో ఆకలి తగ్గుతుంది. తద్వారా కడుపు నిండిన భావన కలిగి భోజనం కూడా తక్కువగా తింటాం.
రాత్రి నిద్రించడానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. అది అర్థరాత్రి సమయంలో కలిగే ఆకలిని నియంత్రిస్తుంది. పైన చెప్పిన సమయాల్లో కాకుండా రోజు మొత్తంగా వివిధ సమయాల్లో 9 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీంతోపాటు అధిక బరువును కూడా తగ్గిస్తుంది. సోడా, జ్యూస్ వంటివి తాగాల్సి వచ్చినప్పుడు వాటికి బదులుగా ఒక్కో గ్లాస్ నీటిని తాగండి. దీంతో శరీరంలో అదనపు షుగర్స్ చేరవు. బరువు కూడా తగ్గుతారు.
బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసినా గానీ ఆకలిగా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగండి. దీంతో ఆకలి తగ్గుతుంది. మళ్లీ ఆకలి వేయదు. బరువు కూడా తగ్గవచ్చు. పైన చెప్పిన విధంగా నీటిని రోజూ తాగుతూ, సరైన వేళకు భోజనం చేస్తూ, వ్యాయామం చేస్తుంటే అతి తక్కువ వ్యవధిలోనే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…