Periods : నేటి తరుణంలో మారిన జీవన విధానం కారణంగా చాలా మంది స్త్రీలల్లో నెలసరి ఆలస్యంగా వస్తుంది. అలాగే నెలసరి సమయంలో తలెత్తే ఇబ్బందులు కూడా మరింత తీవ్రమయ్యాయి. నెలసరి సరిగ్గా సమయానికి వచ్చిన వారిని అదృష్టవంతులుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది స్త్రీలల్లో పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నప్పటికి నెలసరి రోజురోజుకు ఆలస్యమవుతూ ఉంటుంది. నెలసరి ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే కొందరిలో నెలసరి వచ్చినప్పటికి పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒఇక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల నెలసరి సమయానికి రావడంతో పాటు ఆ సమయంలో పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నెలసరి సమయానికి వచ్చేలా చేసే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వామును ఉపయోగించాల్సి ఉంటుంది. నెలసరి ఆలస్యమవ్వకుండా ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేలా చేయడంలో వాము సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. వాముతో డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల నెలసరి ఆలస్యమవ్వకుండా వెంటనే రావడంతో పాటు కడుపులో నొప్పి కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. వాములో థైమాల్, సాపోనిన్ అనేరెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గర్భాశయంలో కండరాలు ఒకే మోతాదులో సంకోచించేలా చేసి రక్తస్రావం ప్రారంభమయ్యేలా చేయడంలో దోహదపడతాయి.
అలాగే ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నెలసరి సమయంలో రక్తస్రావం సరిగ్గా అయ్యేలా చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే గర్భాశయంలో పొరలు తొలగిపోయేటప్పుడు ప్రొస్టాగ్లాడిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి రసాయనాలు నొప్పిని కలిగిస్తాయి. వాము కషాయాన్ని తీసుకోవడం వల్ల ప్రొస్టాగ్లాడిన్ అనే రసాయనాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో నొప్పి సహాజంగా తగ్గుతుంది. నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడే వారు ఈ వాము డికాషన్ ను తీసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయ్యే వారు ఈ వారు కషాయాన్ని తాగకపోవడమే మంచిదని ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తస్రావం మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
నెలసరి ఆలస్యమవ్వకుండా సమయానికి వచ్చేలా చేయడంలో అలాగే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో అదే విధంగా నెలసరి సమయంలో సరిగ్గా రక్తస్రావం అయ్యేలా చేయడంలో వాము కషాయం ఎంతగానో ఉపయోగపడుతుందని స్త్రీలు ఈ వాము కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…