Biryani : మనం తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. మనం ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే మన ఆరోగ్యం అనవసరంగా దెబ్బతింటుంది. కొన్ని రకాల తప్పులు చేయడం వలన అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. రాత్రి పూట త్వరగా తినడం మంచిది. రోజూ రాత్రిళ్ళు త్వరగా భోజనం చేసేయాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా సరిగ్గా ఉంచవచ్చు.
రాత్రిపూట ఆలస్యంగా తింటే ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్ వంటి వాటికి దారి తీస్తుంది. కాబట్టి రాత్రిళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేసి నిద్రపోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి 7:00 గంటలకి ముందు భోజనం చేయాలి. రాత్రిళ్ళు సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట జీవక్రియ తక్కువగా ఉండడం వలన ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని ఆ తప్పు చేయకండి.
అదనపు కేలరీలు కొవ్వులో పేరుకుపోవడం మొదలుపెడతాయి. కాబట్టి రాత్రిళ్ళు త్వరగా తినడం తేలికగా తినడం చాలా అవసరం. రాత్రిపూట బిర్యానీ వంటివి తీసుకోకూడదు. అధికంగా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలని రాత్రిళ్ళు తీసుకోవడం వలన శరీరంలో కొన్ని భయంకరమైనవి చోటు చేసుకుంటాయి. రాత్రిపూట గుడ్డు పచ్చ సొన తింటే కూడా మంచిది కాదు. రాత్రిపూట ఎక్కువ తింటే, పిత్తాశయ రాళ్లు ఉన్నవారిలో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
రాత్రిపూట ఎక్కువగా తినడం వలన నిద్రకి కూడా ఆటంకం కలుగుతుంది. బాగా నిద్రపోలేరు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఎక్కువగా తింటే గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా తినడం వలన జీర్ణకోశ సమస్యలు వస్తాయి. పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట, మలబద్ధకం ఇలాంటివి కలగవచ్చు. కాబట్టి, రాత్రిళ్ళు ఎక్కువ ఆహార పదార్థాలను తీసుకోకండి. లైట్ గా తీసుకోండి. త్వరగా తీసుకోండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…