Biryani : మనం తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. మనం ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే మన ఆరోగ్యం అనవసరంగా దెబ్బతింటుంది. కొన్ని రకాల తప్పులు చేయడం వలన అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. రాత్రి పూట త్వరగా తినడం మంచిది. రోజూ రాత్రిళ్ళు త్వరగా భోజనం చేసేయాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా సరిగ్గా ఉంచవచ్చు.
రాత్రిపూట ఆలస్యంగా తింటే ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్ వంటి వాటికి దారి తీస్తుంది. కాబట్టి రాత్రిళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేసి నిద్రపోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి 7:00 గంటలకి ముందు భోజనం చేయాలి. రాత్రిళ్ళు సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట జీవక్రియ తక్కువగా ఉండడం వలన ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని ఆ తప్పు చేయకండి.
అదనపు కేలరీలు కొవ్వులో పేరుకుపోవడం మొదలుపెడతాయి. కాబట్టి రాత్రిళ్ళు త్వరగా తినడం తేలికగా తినడం చాలా అవసరం. రాత్రిపూట బిర్యానీ వంటివి తీసుకోకూడదు. అధికంగా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలని రాత్రిళ్ళు తీసుకోవడం వలన శరీరంలో కొన్ని భయంకరమైనవి చోటు చేసుకుంటాయి. రాత్రిపూట గుడ్డు పచ్చ సొన తింటే కూడా మంచిది కాదు. రాత్రిపూట ఎక్కువ తింటే, పిత్తాశయ రాళ్లు ఉన్నవారిలో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
రాత్రిపూట ఎక్కువగా తినడం వలన నిద్రకి కూడా ఆటంకం కలుగుతుంది. బాగా నిద్రపోలేరు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఎక్కువగా తింటే గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా తినడం వలన జీర్ణకోశ సమస్యలు వస్తాయి. పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట, మలబద్ధకం ఇలాంటివి కలగవచ్చు. కాబట్టి, రాత్రిళ్ళు ఎక్కువ ఆహార పదార్థాలను తీసుకోకండి. లైట్ గా తీసుకోండి. త్వరగా తీసుకోండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…