Curry Leaves For Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజూ తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారకుండా నిరోధిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్, కార్బజోల్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. కరివేపాకులలో ఫైబర్ సమృద్దిగా ఉండడం వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకు పొడి తయారుచేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు.
కరివేపాకును ఏ రూపంలో తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్తో బాధపడేవారు.. డయాబెటిస్ రాకుండా ఉండాలని అనుకునేవారు కరివేపాకుని తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు కరివేపాకులను నేరుగా అలాగే నమిలి మింగాలి. లేదా కషాయం, జ్యూస్ తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా షుగర్ ఉన్నవారు కరివేపాకులతో లాభాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…