Acidity Home Remedies : తరచూ మనకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తిన్నది సరిగ్గా జీర్ణం కూడా అవ్వదు. అదేపనిగా తేన్పులు రావడం, ఆహారం జీర్ణం అవ్వకపోవడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎసిడిటీ వలన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా ఎసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు ఉబ్బరంగా వున్నా, ఊరికే తేన్పులు వస్తున్నా, లేదంటే తిన్నది సరిగ్గా అరగలేదు అనిపించినా పెద్దకా కంగారు పడక్కర్లేదు.. సింపుల్ గా ఇంటి చిట్కాలతో మనం ఉపశమనాన్ని పొందవచ్చు. మరి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం ఎండు ద్రాక్ష పండ్లు తీసుకోండి. రాత్రిపూట, నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. పేగుల పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్ సంబంధిత సమస్యల్ని, దూరం చేసుకోవచ్చు. రాత్రి అన్నం లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, గోరువెచ్చని పాలు పోసి తోడు పెట్టుకోండి. ఉదయాన్నే, అల్పాహారం కింద దీన్ని తీసుకోండి. ఇలా చేయడం వలన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
మంచి బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్తుంది. ఎసిడిటీ బాధ ఉండదు. గులాబీ రేకుల్ని ప్రాసెస్ చేసి, తయారు చేసిన గుల్కండ్ కూడా, బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట పడుకోవడానికి ముందు, ఈ గుల్కండ్ వాటర్ ని తాగండి. ఎసిడిటీ సమస్యల నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు.
కలబంద గుజ్జు తీసి, నీటిలో కలిపి పల్చటి జ్యూస్ లాగ చేసుకుని తాగితే కూడా ఈ సమస్య నుండి బయట పడచ్చు. కావాలంటే, మీకు స్టోర్స్ లో డైరెక్ట్ గా దొరుకుతుంది. అదైనా కొనుగోలు చేసి తీసుకోవచ్చు. రోజులో ఎప్పుడు గ్యాస్ అనిపించినా, వేడి నీటిని కానీ గోరువెచ్చని నీటిని కానీ తీసుకోండి వెంటనే తగ్గుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…