చాలా మందికి స్వీట్స్ తినాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయట ఫుడ్ తినాలంటే కాస్త వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఎంతో ఇష్టమైన స్వీట్స్ బయట నుంచి కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు. మరి ఇంట్లో తయారుచేసుకొనే స్వీట్లలో కాలా జామున్ ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*కోవా 400 గ్రా
*బొంబాయి రవ్వ టేబుల్ స్పూన్
*బాదాం, కాజు ,పిస్తా గుప్పెడు
*బేకింగ్ పౌడర్ చిటికెడు
*నెయ్యి సరిపడా
*చెక్కర -కేజీ
*పన్నీర్ 100గ్రాములు
*మైదా -అరకప్పు
ముందుగా కాలా జామూన్ తయారు చేయడానికి చక్కెర పాకం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఒక కిలో పంచదారకు రెండు కప్పుల నీటిని వేసి చక్కెర పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పన్నీరు ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ సోడా, కోవా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ముంచి రెండు స్పూన్ల మిశ్రమాన్ని పక్కకు తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్ వేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిగిలిన జామున్ మిశ్రమంతో కొద్దిగా పెద్ద ఉండలు తయారు చేసుకుని అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కలర్ వేసి మనకు నచ్చిన రీతిలో పొడవుగా లేదా గుండ్రంగా తయారుచేసుకొని బాగా మరుగుతున్న నూనెలో వేసి ముదురు ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న జామూన్స్ ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి కరమైన కాల జామున్ తయారైనట్లే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…