చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ క్రమంలోనే చికెన్ తో వివిధ రకాల రెసిపీ తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. ఈక్రమంలోనే కరకరలాడే చికెన్ పాప్ కార్స్ అంటే చిన్న పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్లు అలాగే కరకరలాడే క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
* బోన్లెస్ చికెన్ 250 గ్రా
* వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
* నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
* ఉప్పు రుచికి సరిపడా
* జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్
* గరం మసాలా ఒక టేబుల్ స్పూన్
* బ్రెడ్ 4
* గుడ్లు 1
* పాలు 1 టేబుల్ స్పూన్
* మైదాపిండి 1/2 కప్పు
* నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రపరచుకోవాలి. ఈ చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. తరువాత పాన్ పై నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ ముక్కలను మిక్సీ జార్ లో పౌడర్ చేసే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ లోకి జీలకర్ర మసాలా కలుపుకోవాలి.
మరొక గిన్నెలో గుడ్డును పగలగొట్టి అందులో పాలు పోసి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. స్టౌ పై మరో కడాయిని గురించి చికెన్ ముక్కలను వేయించడానికి నూనె వేసి నూనె మరిగించాలి. తర్వాత ఫ్రిజ్ లో ఉంచిన చికెన్ ముక్కలను తీసుకొని వాటిని ముందుగా కోడి గుడ్డు మిశ్రమంలో డిప్ చేసి తరువాత బ్రెడ్ పౌడర్ లో దొర్లించాలి. ఆ తర్వాత మరోసారి గుడ్డు మిశ్రమంలో లిఫ్ట్ చేసి మరొకసారి బ్రెడ్ పౌడర్లో, చికెన్ ముక్కలకు మొత్తం బ్రెడ్ అంటుకునే విధంగా దొర్లించే నూనె వేడయ్యాక నూనెలో వేసి చిన్న మంటపై బాగా బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. వేడి వేడిగా ఉన్న ఈ క్రిస్పీ చికెన్ ముక్కలను మనకు నచ్చిన సాస్ వేసుకొని వేడిగా తింటే అచ్చం రెస్టారెంట్ రుచిని కలిగి ఉంటుంది. మరింకెందుకాలస్యం ఈ సింపుల్ రెసిపీని మీరూ ట్రై చేయండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…