చికెన్ మటన్ అంటూ ఎన్నో రెసిపీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది మటన్ మసాలా గ్రేవీ తినడానికి ఇష్టపడుతారు. మరి ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మటన్ అరకిలో
*ఉల్లిపాయ ఒకటి
*వెల్లుల్లి చిన్న సైజు ఒక్కటి
*ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
*టేబుల్ స్పూన్ కారం పొడి
*కొత్తిమీర
*కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
*అల్లం తురుము టేబుల్ స్పూన్
*లవంగాలు 4
*ఎండుమిర్చి 2
*ఆవాలు, జీలకర్ర అర టేబుల్ స్పూన్
*కరివేపాకు రెమ్మ
*నూనె 2 టేబుల్ స్పూన్లు
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
ముందుగా మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, లవంగాలు, కొబ్బరి తురుము, అల్లం, కొత్తిమిర వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తరువాత మటన్ శుభ్రం చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత మటన్ వేసి బాగా కలుపుకోవాలి.రెండు నిమిషాల పాటు మటన్ నూనెలో నటించడం వల్ల మాటల్లో ఉన్న నీటి శాతం వెళ్ళిపోతుంది.
రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా వేయాలి. తక్కువ మంటపై మసాలాను ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గనివ్వాలి.తర్వాత కారం పొడి వేసి రెండు నిమిషాలు మరిగిన తర్వాత తగినంత నీరు వేసి కుక్కర్ మూత పెట్టాలి. సుమారు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం వెళ్లి వరకు ఉండి తర్వాత కుక్కర్ మూత తీసి మరో రెండు నిమిషాల పాటు సిమ్ లో మటన్ ఉడికించు కుంటే మటన్ మసాలా గ్రేవీ తయారైనట్టే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…