బిర్యాని అనే పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ అంటేనే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బిర్యాని ఎన్ని రకాల పద్ధతులు తయారుచేసిన వదలకుండా ఫుల్లుగా లాగించేస్తారు. అయితే బిర్యానీ చేయాలంటే ఇప్పటివరకు మనం బాస్మతి రైస్ ఉపయోగించి చేయడం గురించి విన్నాము. కానీ రైస్ చికెన్ బిర్యాని గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఇక్కడ రైస్ లెస్ బిర్యాని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి,దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేయడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి సేమియాలను బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. సేమియా పక్కన పెట్టుకొని అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తరువాత అందులో నల్ల జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి ,ఉల్లిపాయ, పుదీనా వేసి బాగా వేయించాలి.
ఈ మిశ్రమం మొత్తం బంగారువర్ణంలోకి వచ్చిన తర్వాత అందులో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాల, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉన్న టమోటాలను వేసి టమోటా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత రెండు కప్పుల నీటిని వేసి బాగా ఉడికించాలి. చికెన్, సేమియా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత వేడి వేడి రైస్ లెస్ చికెన్ బిర్యాని తయారైపోయింది. కేవలం తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన బిర్యాని చేయవచ్చు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…