బిర్యాని అనే పేరు వినగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ అంటేనే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. బిర్యాని ఎన్ని రకాల పద్ధతులు తయారుచేసిన వదలకుండా ఫుల్లుగా లాగించేస్తారు. అయితే బిర్యానీ చేయాలంటే ఇప్పటివరకు మనం బాస్మతి రైస్ ఉపయోగించి చేయడం గురించి విన్నాము. కానీ రైస్ చికెన్ బిర్యాని గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఇక్కడ రైస్ లెస్ బిర్యాని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి,దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేయడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి సేమియాలను బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. సేమియా పక్కన పెట్టుకొని అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తరువాత అందులో నల్ల జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి ,ఉల్లిపాయ, పుదీనా వేసి బాగా వేయించాలి.
ఈ మిశ్రమం మొత్తం బంగారువర్ణంలోకి వచ్చిన తర్వాత అందులో చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాల, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉన్న టమోటాలను వేసి టమోటా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత రెండు కప్పుల నీటిని వేసి బాగా ఉడికించాలి. చికెన్, సేమియా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత వేడి వేడి రైస్ లెస్ చికెన్ బిర్యాని తయారైపోయింది. కేవలం తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన బిర్యాని చేయవచ్చు.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…