Tablets : మనకు ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్ వద్దకు వెళ్లి లేదంటే సొంతంగా వైద్యం చేసుకోదలచి టాబ్లెట్లు, క్యాప్సూల్స్ వంటివి వేసుకుంటాం. దీంతో అస్వస్థత నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరు టాబ్లెట్లు వేసుకున్నా మంచి నీరు తప్పనిసరి. నీటితోనే టాబ్లెట్ వేసుకోవాలి. అలా అని మనకు వైద్యులు కూడా చెబుతారు. అయితే కొందరు మాత్రం ఈ సలహాను పెడచెవిన పెడతారు. నీళ్లు లేకుండానే కేవలం టాబ్లెట్నే అలాగే డైరెక్ట్గా మింగేస్తారు. దీని వల్ల ఏం జరుగుతుంది, అని ఆలోచించరు. ఈ క్రమంలో మనం అసలు టాబ్లెట్లను నీటితోనే ఎందుకు వేసుకోవాలి..? ఎంత నీటితో వేసుకోవాలి..? అసలు నీటితో టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ఏవైనా ఎవరైనా కచ్చితంగా వాటిని నీటితోనే వేసుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా మింగి అప్పుడు టాబ్లెట్ వేసుకుని మింగేయాలి. ఆ తరువాత గ్లాస్లో ఉన్న నీటిని మొత్తం తాగాలి. ఇలా చేయడం వల్ల మనం మింగిన టాబ్లెట్ లేదా కాప్సూల్ నేరుగా జీర్ణాశయానికి చేరుతుంది. ఎలాంటి ఆటంకం కలగకుండా అది కరుగుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ వల్ల మనకు అనారోగ్యం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
అయితే కొందరు కేవలం టాబ్లెట్నే డైరెక్ట్గా అలాగే వేసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే.. టాబ్లెట్ ఒక్కోసారి గొంతులో ఇరుక్కోవచ్చు. అలా అయితే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులు షాక్కు లోనై పడిపోతారు. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఒక్కోసారి గాలి ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక వేళ గొంతులో కాకపోయినా ఆ టాబ్లెట్ జీర్ణకోశం గోడలకు అతుక్కుంటుంది. దీంతో సరిగ్గా కరగదు. అప్పుడు ఆ మెడిసిన్ వేసుకుని కూడా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు కొన్ని రకాల టాబ్లెట్లను అలా వేసుకుంటే కడుపులో అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కనుక ఎవరైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ను కచ్చితంగా నీటితో వేసుకోవాల్సిందే. అది కూడా ఒక గ్లాస్కు తక్కువ నీరు కాకుండా చూసుకోవాలి. అయితే పూర్తిగా చల్లని లేదా వేడి నీటితో మాత్రం మందులు వేసుకోకూడదు. అలా వేసుకున్నా ఆ మందులు సరిగ్గా కరగవు. శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. కనుక టాబ్లెట్లు వేసుకునే విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఎవరైనా సరే కచ్చితంగా పాటించాల్సిందే.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…