Tablets : మనకు ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్ వద్దకు వెళ్లి లేదంటే సొంతంగా వైద్యం చేసుకోదలచి టాబ్లెట్లు, క్యాప్సూల్స్ వంటివి వేసుకుంటాం. దీంతో అస్వస్థత నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరు టాబ్లెట్లు వేసుకున్నా మంచి నీరు తప్పనిసరి. నీటితోనే టాబ్లెట్ వేసుకోవాలి. అలా అని మనకు వైద్యులు కూడా చెబుతారు. అయితే కొందరు మాత్రం ఈ సలహాను పెడచెవిన పెడతారు. నీళ్లు లేకుండానే కేవలం టాబ్లెట్నే అలాగే డైరెక్ట్గా మింగేస్తారు. దీని వల్ల ఏం జరుగుతుంది, అని ఆలోచించరు. ఈ క్రమంలో మనం అసలు టాబ్లెట్లను నీటితోనే ఎందుకు వేసుకోవాలి..? ఎంత నీటితో వేసుకోవాలి..? అసలు నీటితో టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ఏవైనా ఎవరైనా కచ్చితంగా వాటిని నీటితోనే వేసుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా మింగి అప్పుడు టాబ్లెట్ వేసుకుని మింగేయాలి. ఆ తరువాత గ్లాస్లో ఉన్న నీటిని మొత్తం తాగాలి. ఇలా చేయడం వల్ల మనం మింగిన టాబ్లెట్ లేదా కాప్సూల్ నేరుగా జీర్ణాశయానికి చేరుతుంది. ఎలాంటి ఆటంకం కలగకుండా అది కరుగుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ వల్ల మనకు అనారోగ్యం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
అయితే కొందరు కేవలం టాబ్లెట్నే డైరెక్ట్గా అలాగే వేసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే.. టాబ్లెట్ ఒక్కోసారి గొంతులో ఇరుక్కోవచ్చు. అలా అయితే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులు షాక్కు లోనై పడిపోతారు. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఒక్కోసారి గాలి ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక వేళ గొంతులో కాకపోయినా ఆ టాబ్లెట్ జీర్ణకోశం గోడలకు అతుక్కుంటుంది. దీంతో సరిగ్గా కరగదు. అప్పుడు ఆ మెడిసిన్ వేసుకుని కూడా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు కొన్ని రకాల టాబ్లెట్లను అలా వేసుకుంటే కడుపులో అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కనుక ఎవరైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ను కచ్చితంగా నీటితో వేసుకోవాల్సిందే. అది కూడా ఒక గ్లాస్కు తక్కువ నీరు కాకుండా చూసుకోవాలి. అయితే పూర్తిగా చల్లని లేదా వేడి నీటితో మాత్రం మందులు వేసుకోకూడదు. అలా వేసుకున్నా ఆ మందులు సరిగ్గా కరగవు. శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. కనుక టాబ్లెట్లు వేసుకునే విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఎవరైనా సరే కచ్చితంగా పాటించాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…