రోడ్లను సరైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించకపోతే కొద్ది రోజులకే వాటిపై గుంతలు ఏర్పడుతుంటాయి. వాహనాలు తిరిగే కొద్దీ, వర్షాలకు రోడ్లు దెబ్బ తింటాయి. ఈ క్రమంలో రోడ్లపై ఏర్పడే గుంతల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తుంటారు. ఇక యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అయితే రోడ్లపై ఉన్నగుంతలను పూడ్చమని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోరు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. కానీ ఆ జంట మాత్రం వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగిస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా వారు రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన 73 ఏళ్ల గంగాధర్ తిలక్ రోడ్ డాక్టర్గా పేరు గాంచారు. ఆయన తన భార్య వెంకటేశ్వరితో కలిసి గత 11 ఏళ్లుగా రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. తిలక్ 35 ఏళ్ల పాటు రైల్వేలో ఉద్యోగిగా పనిచేశారు. తరువాత హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆ తరువాత 1 ఏడాది పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. అయితే రహదారులపై ఉన్న గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకుని వాటిని పూడ్చేందుకు నడుం బిగించారు. అలా 11 సంవత్సరాల నుంచి ఆయన, తన భార్యతో కలిసి ఇప్పటి వరకు 2030 వరకు గుంతలను పూడ్చారు.
తనకు వచ్చే పెన్షన్ మొత్తంతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో గుంతలను పూడ్చేందుకు అవసరమైన సామగ్రి, పనిముట్లు ఉంటాయి. వాటితో గుంతలను పూడుస్తున్నారు. అందుకనే తిలక్కు రోడ్ డాక్టర్గా పేరు వచ్చింది. అయితే మొదట్లో గుంతలను పూడ్చమని అధికారులకు వారు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో ఆ దంపతులే స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి రోడ్లపై గుంతలను పూడుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల్లో చలనం వచ్చింది. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అవసరమైన సామగ్రిని వారు ఆ దంపతులకు అందజేస్తున్నారు. ఏది ఏమైనా తిలక్ లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నారు కాబట్టే ప్రజలకు సహాయం అందుతోంది. ఆయన చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…