Salt : ఇప్పుడంటే మనం దేన్నయినా శుభ్రం చేయాలంటే వస్తువుకు తగినట్టుగా రక రకాల స్ప్రేలు, పౌడర్లను వాడుతున్నాం. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వస్తువులను ఎంతో శుభ్రం చేసుకునే వారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే పలు గుణాల వల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కారకంగా మన వాళ్లు ఉపయోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ప్ల వంటి ప్రదేశాల్లో చల్లండి. దీంతో చీమలు రావు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే తేమ వాతావరణం కూడా పొడిగా అవుతుంది. కొద్దిగా ఉప్పు, కొంత యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీంతో రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి. రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీటర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని ఉపయోగించి కిటికీ తలుపులు, గ్లాస్ విండోస్, కార్ విండోస్లను క్లీన్ చేస్తే శుభ్రంగా మెరుస్తాయి. పైన చెప్పిన ఉప్పు, గోరు వెచ్చని నీటి మిశ్రమాన్ని ఉపయోగించి కిచెన్ సింక్ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన పదార్థాలన్నీ పోతాయి.
కొద్దిగా ఉప్పు, లవంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్ను తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. అనంతరం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. దీంతో చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. కొంత నీటిలో ఉప్పును వేసి బాగా కలిపి ఆ నీటిలో ఒక గుడ్డ ముక్కను ముంచి దాంతో కార్పెట్లు, దుప్పట్లు, దుస్తులపై పడ్డ మరకలను తుడవాలి. దీంతో ఆ మరకలు ఇట్టే తొలగిపోతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.
బేకింగ్ సోడా, ఉప్పును సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని కొంత నీటికి కలిపి పేస్ట్లా చేసి దాంతో పళ్లు తోముకుంటే పళ్లు మిలమిలా మెరుస్తాయి. దుస్తులను డిటర్జెంట్ లేదా సబ్బుతో ఉతికిన తరువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తులను ముంచి తీయాలి. దీంతో దుస్తులు ష్రింక్ అవవు. దీనికి తోడు బట్టలు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…