Salt Water : మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పును సరిపోయినంతగా తీసుకుంటే ఏమీ కాదు, కానీ అది మోతాదుకు మించితేనే మనకు ఇతర సమస్యలు వస్తాయి. అయితే ఉప్పు కలిపిన నీటిని నిత్యం ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రలేమి, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందట. ఈ క్రమంలో నిత్యం ఉప్పు నీటిని తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు నీటిని ఉదయాన్నే తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఆ నీటిలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, నిర్మాణానికి, దృఢత్వానికి ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంలోనూ ఉప్పు నీరు బాగానే పనిచేస్తుంది. దీంట్లో అధికంగా ఉండే సల్ఫర్, క్రోమియం తదితర పదార్థాలు చర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి. అంతేకాదు చర్మం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. ఉప్పు నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. ఇది శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. దీని వల్ల మనసుకు ప్రశాంతత చేకూరి నిద్ర సులభంగా పడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను బయటికి పంపడంలో ఉప్పు నీరు బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని చెడు బాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఉప్పు నీటిని తరచూ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు ఉప్పు నీటిలో ఉన్నాయి. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలోనూ ఉప్పు నీరు బాగానే ఉపయోగపడుతుంది. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పు నీరు తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటిస్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.
అయితే ఉప్పు నీళ్లను తయారు చేసేందుకు గాను ఉప్పును ఎక్కువగా వాడరాదు. పావు టీస్పూన్ లో సగం ఉప్పు వేయాలి. ఎక్కువ ఉప్పు వేస్తే విరేచనాలు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ నీళ్లను తాగేముందు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు వస్తాయి.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…