మనకు అందుబాటులో ఉండే అనేక రకాల గింజల్లో నువ్వులు కూడా ఒకటి. వీటిని కూరల్లో, పచ్చళ్లలో వేస్తుంటారు. నువ్వులలో అనేక పోషకాలు ఉంటాయి. నువ్వుల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. నువ్వుల్లో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నిషియం కూడా ఎక్కువే.
2. నువ్వులను లేదా దాంతో తయారు చేసే నూనెను వాడడం హైబీపీ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. వాటిని తీసుకుంటే ఐరన్ లోపం పోతుంది. రక్తహీనత తగ్గుతుంది.
4. నువ్వుల్లో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. వాటిల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. నువ్వుల్లో ఉండే మోనో అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి.
6. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
7. నువ్వులను తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం, జింక్లు ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశలు తక్కువగా ఉంటాయి.
8. నువ్వుల నూనెను వాడుతుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. వారానికి ఒకసారి నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసి స్నానం చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారడమే కాక, చర్మం సురక్షితంగా ఉంటుంది.
9. నువ్వుల నూనెను జుట్టుకు రాస్తుంటే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…