Sr NTR : తెలుగు సినీ పరిశ్రమకు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లులా ఉండేవారు. వారి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఎంతో కృషి చేశారు. వీరిద్దరికి భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, వీరు చేసిన సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వచ్చేవి. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఈ పోటీలో ఈ రెండు సినిమాలు విజయాలు సాధించాయి. చిరంజీవి నటించిన `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించాయి.
అయితే ఇటీవల చిరంజీవి, బాలకృష్ణ గురించి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు.నిర్మాత అశ్వినీ దత్ ఎన్టీఆర్, చిరంజీవి లతో ఎక్కువ సినిమాలు రూపొందించారు. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ రూపొందించారు.అలాగే బాలయ్యతో అశ్వమేధం చిత్రాన్ని రూపొందించారు. ఒకసారి ఓ చిత్ర షూటింగ్ విరామంలో ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య ముచ్చటించుకోగా, వారిద్దరి మధ్య వచ్చిన చర్చని తాజాగా అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మాటల మధ్యలో చిరంజీవి నటించిన ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం లాంటి చిత్రాలు, అలాగే బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు లాంటి చిత్రాల విజయాల గురించి చర్చకు రాగా, సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి, మా కొడుకు బాలయ్యదేనని పెద్దాయన ఎన్టీఆర్ అల్లు రామలింగయ్యతో తరచూ అనేవారని… ఆ తర్వాత ఆ పెద్దాయన చెప్పినట్టుగానే ఆ ఇద్దరు హీరోలు అనేక సినిమా విజయాలతో సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదిగారని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సి. అశ్విని దత్ తెలియజేశారు. ఆరుపదుత వయస్సులోను ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీని దున్నేయడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…