Tripti Dimri : ఎన్ని సినిమాలు చేసిన కూడా దక్కని గుర్తింపు కొందరికి ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రికి వచ్చింది.రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో తృప్తి మెయిన్ హీరోయిన్ కాదు కాని సెకండ్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్గా నటించిన రష్మిక కంటే తృప్తి గురించే ఇప్పుడు అందరు ముచ్చటించుకుంటున్నారు. అందుకు కారణం తృప్తి బోల్డ్ సన్నివేశాలలో అద్భుతంగా నటించడమే. ఏ మాత్రం భయపడకుండా చాలా బోల్డ్గా నటించింది. ఆమె చేసిన బోల్డ్ సీన్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. బెడ్పై నగ్నంగా ఇద్దరూ పడుకున్న సీన్ చూసి థియేటర్లలో ప్రేక్షకులు ఖంగు తిన్నారు.
బోల్డ్ సన్నివేశాలలో తృప్తి నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం. ‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తృప్తిని ‘భాబీ 2’ అని పిలవడం మొదలుపెట్టారు. సినిమాలో తను పోషించిన జోయా అనే పాత్రకంటే భాబీ 2గానే ఆమెకు పేరు వచ్చింది.. ఈ మూవీలో నటించడం కోసం తృప్తి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని సమాచారం. ‘యానిమల్’లో జోయా పాత్ర కోసం తృప్తి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్గా అందుకుందట. ఇది తెలుసుకొని అందరు షాక్ అవుతున్నారు.
యానిమల్ సినిమాలో చాలా హైలెట్ అయింది తృప్తినే. కాని ఈమె రెమ్యూనరేషన్ మాత్రం ఇంత తక్కువ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మికకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందివ్వగా రణబీర్ కపూర్ కు 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక బాబీ డియోల్ ఈ సినిమా కోసం నాలుగు కోట్లు అనిల్ కపూర్ రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యానిమల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. వెయ్యి కోట్లు సులువుగా రాబడుతుందని అంటున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…