Tiger Nageswara Rao OTT : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్యూర్ మాస్ ఇమేజ్తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచే హీరోలలో రవితేజ ఒకరు. పక్కా కమర్షియల్ సినిమాలు ఇటీవలి కాలంలో చేస్తున్న రవితేజ ధమాకాతో మంచి హిట్ అందుకున్నాడు. ‘ధమాకా’తో వంద కోట్ల క్లబ్లో చేరిన తర్వాత ‘రావణాసుర’తో డిజాస్టర్ చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఇటీవలే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు.దసరా పండుగ సమయంలో పాన్ ఇండియాగా విడుదలైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అక్టోబర్ 20న భగవంత్ సింగ్ కేసరి, లియో వంటి సినిమాలతో పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
విమర్శకుల ప్రశంసలు అందుకని మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ మిగతా చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. రవితేజ హీరోగా వంశీ అనే డైరెక్టర్ తెరకెక్కించిన సినిమానే ‘టైగర్ నాగేశ్వరరావు కాగా 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్ను ముగించాల్సి వచ్చింది.
చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సెలైంట్గా టైగర్ నాగేశ్వరరావును ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం నుండి తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…