Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య పేరు ఇప్పుడు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ముఖ్యంగా బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా అయ్యారు. హీరోయిన్గా మొదటి సినిమాలోనే ఓ రేంజ్లో చించేసింది. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కాస్త నెగెటివ్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే బేబి సినిమాలో కథానాయికగా నటించకముందు వైష్ణవి చైతన్య.. అల వైకుంటపురంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలిగా కనిపించి మెప్పించింది. టక్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను, వలిమై, ప్రేమ దేశం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ లో చేస్తూనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇక బేబీ చిత్రంతో అద్భుతమైన నటనను కనబర్చిన ఈమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది. బేబి హిట్తో వైష్ణవి చిత్రానికి వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో రెండు, మూడేళ్ల వరకూ ఈ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని.. ఆమెను మించిన హీరోయిన్ గా కచ్చితంగా ట్రెండ్ చేస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ భామ సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా, ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చాన్స్ కొట్టేసిందని సమాచారం.
ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్యకి సంబంధఙంచిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ ఊహించని విధంగా అమ్మడికి ఒక గిఫ్ట్ పంపించారట. వైష్ణవికి.. అల్లు అర్జున్ ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ పంపించినట్లు ఓ వార్త వైరల్గా మారింది. అయితే దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇన్పుట్స్తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్లో వైష్ణవి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోందట. ఈ క్రమంలోనే ఆమెకు అడ్వాన్స్ రూపంలో ఈ చెక్ పంపించారని , ఇక బన్నీ నుండి చెక్ అందుకున్న వైష్ణవి ఫుల్ ఖుష్ అయినట్టు సమాచారం.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…