Karthika Masam 2023 : కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. శివుడికి ఈ నెల అంతా ప్రత్యేకించి పూజలు చేస్తారు. కార్తీక మాసంలో తులసి పూజ ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో తులసి పూజ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీకమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి నాడు, తులసి కళ్యాణాన్ని చేస్తారు. ఈ మాసం అంతా తులసిని పూజించడం వలన సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. భయం కూడా తగ్గుతుంది. మత విశ్వాసం ప్రకారం కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట స్నానం చేసి, తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేస్తే జీవితంలో సానుకూలత కలుగుతుంది. దేవుడు ఆశీస్సులు కూడా పొందవచ్చు.
స్వయంగా తులసి పూజ యొక్క విశిష్టతని విష్ణువు బ్రహ్మ కి చెప్పారు. బ్రహ్మా నారదుడికి చెప్పినట్లు నారదుడు మహారాజు ప్రత్యూకి చెప్పడం గురించి, మత గ్రంథాలలో ఉంది. ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా మంచిది. కార్తీక మాసంలో ఒక దీపాన్ని కాకుండా రెండు దీపాలని పెట్టడం చాలా మంచిది. రెండు దీపాలని కూడా, ఆవు నెయ్యితో వెలిగించి, కుంకుమ, పసుపు పెట్టి పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది.
ఆయుర్వేదంలో ఉసిరికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉసిరిలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరి వృక్షానికి పూజలు చేస్తే చాలా మంచిది. అలానే కార్తీకమాసంలో పవిత్ర నది స్నానం చేస్తే కూడా చాలా మంచిది. కార్తిక మాసంలో యమునా నది కి ప్రత్యేక పూజలు చేస్తారు.
అలానే, కార్తీక మాసంలో యమద్వితీయ రోజున యమునా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి, కార్తీక మాసంలో ఈ పద్ధతుల్ని కనుక ఆచరించినట్లయితే, అంతా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఇలా పాటిస్తే, అంతా మంచి జరుగుతుంది సంతోషంగా ఉండొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…