
తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం థియేట్రికల్ రిలీజ్కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు ఇది ఆయన చివరి సినిమా కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల కానుంది. మొదట జనవరి 9, 2026న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా సెన్సార్ అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యల వల్ల విడుదల నిలిచిపోయింది. కొన్ని హింసాత్మక సన్నివేశాలు, రాజకీయ సూచనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC)పై దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. ఇకపై సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. సర్టిఫికేషన్పై తుది నిర్ణయం ఒక వారంలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో వారం తరువాత సినిమా రిలీజ్ అవనుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 19న విడుదల..?
కాగా రాజకీయ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జననాయగన్ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డె, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇక రివిజన్ కమిటీ నుంచి అనుమతి లభిస్తే, ఫిబ్రవరి 19వ తేదీన సినిమా విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రక్రియలు సమయానికి పూర్తైతే విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.







