Nithya Menon : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకి ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా నిత్యామీనన్ ప్రభాస్ మ్యాటర్ తీసుకొచ్చి వార్తలలో నిలిచింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ నిత్యామీనన్.. కేవలం హీరోయిన్గానే కాకుండా.. సింగర్గా కూడా రాణిస్తోంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తోంది.
నిత్యా మీనన్ తాజాగా భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ సరసన నటించింది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్ నిర్మాతగా కూడా మారింది. తాజాగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చింది.
ప్రభాస్ ఇష్యూపై నిత్యా స్పందించడం గమనార్హం. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే. ఆ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంది. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కుంగిపోయాను. అలా మొదలైంది తెలుగులో నా తొలి చిత్రం. ఆ సమయంలో నాకు తెలుగు సరిగా రాదు. తెలుగులో అప్పటి వరకు నేను ఏ సినిమా చూడలేదు. అలాంటి సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగితే అతనెవరో తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని చాలా పెద్దిగా చిత్రీకరించారు. అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకున్నాను. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని భావించాను.. అని నిత్యా చెప్పుకొచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…