NBK : తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న టాక్ షోలలో అన్స్టాపబుల్ అనే షో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరు హీరోలను కవర్ చేస్తోంది అన్స్టాపబుల్ షో. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ టీమ్ అన్స్టాపబుల్ షోలో సందడి చేసింది.
ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. ఇప్పుడు వీరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తోడయ్యాడు. “నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ బాలయ్యతో దిగిన ఫొటో షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఈ షో అతి త్వరలోనే ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.
తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా బాలయ్య షోలో రాజమౌళి, కీరవాణి హాజరైనట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన ఆహా టీం త్వరలోనే ప్రోమో రిలీజ్ చేయనుంది. షోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ హీరోలు కూడా షోలో పాల్గొంటే ఈ ఎపిసోడ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…