Mrunal Thakur : బాలీవుడ్ అందాల ముద్దుగమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం చిత్రంలో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్ల హృదయాలని కట్టిపడేసింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి వచ్చిన ఈ భామ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆయిపోయింది.
హాయ్ నాన్న సినిమాలో నానికి జోడిగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్’ షూట్లో భాగంగా మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు. ‘హాయ్ నాన్న’కు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేటర్కు వెళ్లారు. ‘సీతారామం’ నుంచి న్యూజెర్సీ తనపై ఎంతో ప్రేమను కురిపిస్తోందని.. ‘హాయ్ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఇంతలో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ”మీకు పెళ్లైందా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలకు నవ్వులు పూయించిన ఆమె ”త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా” అని బదులిచ్చారు. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మృణాల్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటుందా, లేకుంటే బయట వ్యక్తిని చేసుకుంటుందా అనే దానిపై క్లారిటీ రానుంది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…